Sonia కాదు వారి అత్తమ్మ ఇందిరైనా సరే ఈ హఠాంపరిణామాన్ని ఊహించి ఉండరు. దిల్లీలో కూర్చుని, వి.హెచ్ వంటి పూజారుల పూజలు అందుకుంటూ తామే నిర్ణయం తీసుకున్నా పడుంటారని భావించిన సోనియాకు 56 మంది కాంగ్రెస్ ఎం.ఎల్.ఏ ల రాజినామా దిమ్మ తిరిగేలా చేసింది.
ఆరునెలలకో సి.ఎం ను మార్చి చేతులు కాల్చుకుని కాస్త బుద్ది తెచ్చుకున్న దిల్లీ నాయకత్వం వై.ఎస్. మరణానంతరం మళ్ళీ పాత మాట మొదలు పెట్టింది. నేను గత శాసన సభ ఎన్నికల సందర్భాంగానే నా బ్లాగులో స్పష్ఠంగా చెప్పాను. కే.సి.ఆర్ భూతం కాడని, బాటిల్లో భూతమని. టి.ఆర్.ఎస్. ఆవిర్భావం నాటినుండి ఎలక్షన్ టు ఎలక్షన్ తన ఉనికిని పోగొట్టుకుంటూ వచ్చిన తి.ఆర్.ఎస్ లో కే.సి.ఆర్ అతని కుటుంభ సభ్యులు తప్ప మరెవ్వరూ లేని స్థితి వచ్చింది
మార్కెట్ పోగొట్టుకున్న హీరో ఏ.ఆర్ రహ్మాన్ కాల్షీట్ పట్టుకున్నట్టుగా కే.సి.ఆర్ దీక్ష చేపట్టాడు. నాల్రోజులు చెయ్యించి ఉంటే ఆయనగారికి ఆయనే నిమ్మరసం తాగి ఇంటికెళ్ళి క్వార్టర్ కొట్టి పనుకొనే వాడు. వై.ఎస్. ఉన్నంత కాలం చెప్పు క్రింద తేలులా ఉన్న కే.సి.ఆర్ రోశయ్య వాలకం చూసి తోక విప్పాడు నిప్పు పెట్టాడు. కాగితంలోని పులి బొమ్మ చూసి జడుచుకున్నట్టుగా సోన్మియా చిదంబరం చేత ప్రకటన చెయ్యించారు. ఆ ప్రకటన వెలుబడకున్నా కే.సి.ఆర్ దీక్ష విరమించే వాడే.
ఆ దిశగా నింస్ హాస్పిటల్ లో టి.ఆర్.ఎస్ పార్టి పొలిట్ బ్యూరో సమావేశం కూడ ఏర్పాటైంది. అసలు కాంగ్రెస్ పార్టి చరిత్ర తెలిసిన ఎవరికైనా తెలుసు అది ఉత్త ఉసిరికాయల బస్తా. ఆ బస్తా ముడి గట్టిదైతే గాని ఏ కాయ బస్తాలో ఉండదు. కాంగ్రెస్ అదిష్ఠానం తీరే ఇంత. అవసరానికి మించి నాంచడం. లేదా తొందర పాటు నిర్ణయం తీసుకోవడం. ప్రతిభగల వారికన్నా చంచా గాళ్ళను నమ్ముకోవడం. వై.ఎస్. అయితే ఇటు ప్రతిభావంతుడైనప్పటికి విధేయత ప్రదర్శిస్తూ వచ్చాడు.
రోశయ్యలాంటి వారు బాత్ రూం పోవాలన్నా అదిష్ఠానం అనుమతి కోరే వారు. ఇక్కడ తెలంగాణా కాలుతుంటే అంతా అదిష్ఠానం చూసుకుంటుందన్నాడు. విలేకర్లు ఎం.ఎల్.ఏ ల రాజినామా గురించి అడిగితే నాకు తెలియదన్న ఘనుడు ఈయన. లౌఖ్యం ఉండొచ్చుగాని అది మరీ మితి మీరితే ఇలానే ఏడుస్తుంది
అటు ఎన్.టి.ఆర్ గాని ఇటు వై.ఎస్. గాని సమైఖ్యాంద్ర ప్రదేశే దేయంగా ఉన్నవారు. తెలంగాణొస్తే ఏమౌతుంది ? కొత్తగా మరో సి.ఎం, మరో క్యేబినెట్, మరో శచివాలయం ప్రజాదనానికి బొక్క అంతేగా
అసలు కే.సి.ఆర్ది ఒక దీక్షేనా ? సెలైన్ అంటే ఏమి ? అది ఫుద్ కాదా. రోజుకి మూడు పూట్ల సెలైన్ ఎక్కించుకుని దీక్షంటూ కథ నడిపితే సోనియా మేడం విరేచణాలయ్యి చిదంబరం చేత ప్రకటణ చెయ్యించింది. అసలు కే.సి.ఆర్ మీద 420 సెక్షన్ క్రింద కేసు పెట్టించాల్సింది. దీక్షని ప్రజలను మోసగించినందుకు. అసలు మీదియావారిని అనాలి. అదో దీక్ష దానికీ కవరేజి
ఇక రాజినామా చేసిన ఇతర పార్టి ఎం.ఎల్.ఏల వివరాలిలా ఉన్నాయి.
తె.దే.పా: 29
పి.ఆర్.పి 11
ఈ క్లీష్ఠ పరిస్థితిలో సోనియా మేడం చెయ్యవలసింది రెండే ఒకటి తెలంగాణ కావాలో వద్దో తెలంగాణా ప్రాంత ప్రజల మద్య వోటింగ్ కు ఆదేశించటం, జగన్ ను సి.ఎం చెయ్యడం. జతిగిన దుష్పరిణామాలన్ని రోశయ్య చేతగాని తనంతోనే జరిగాయి. కనీశం భవిష్యత్త్లో జరుగనున్న నష్ఠాలను వారించటానికన్నా జగన్ ను సి.ఎం చేసి తీరాల్సిందే
గమనిక:
మా చిత్తూరు పురపాలక చేర్మన్ సహా అందరు కౌన్సిలర్లు మూకుమ్మడిగా రాజినామా చేసేరు
మిగతా అంతా బాగుంది కాని, చివర్లో ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ను సీఎం చెయ్యాలనడం చెంఢాలంగా ఉంది. మొన్న గ్రేటర్ ఎన్నికల్లో చూశారుగా, జగన్ ప్రచారం చేసిన ప్రాంతాలన్నిటిలో కాంగ్రెస్ ఓడిపోయింది. అదీ ఆయన పాపులారిటీ. జగన్కు నాయకత్వ లక్షణాలు ఏ కోశానా లేవు.
రాజన్నా, జగన్ సి.యం కావడానికి ఇది సరైన సమయం కాదన్నా… అందుకే ఇప్పుడు గప్ చుప్ గా వుండాలి.వెనుక చేసే పనులు చేయాలి/చేయించాలి.
అవును వై.యస్.ఆర్ లేని లోటు మనకంటే అమ్మగారికి ఇప్పుడు స్పష్టంగా తెలిసి వచ్చి వుండాలి. చాలా రోజుల తరువాత ఆంధ్ర, రాయలసీమ యం.పి లు కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు.
నాగ ప్రసాద్ గారు,
జగన్ కు నాయకత్వ లక్షణాలు లేవని ఎలా అంటారు. ఆ రెండు పత్రికలకు ధీటుగా ఒక పత్రిక స్థాపించి , టి.వి చేనల్ పెట్టి రాష్ఠ్ర , దేశ వ్యాప్తంగా నెట్ వర్క్ కలిగి ఉండటం ఆయన నాయకత్వ లక్షణాలకు ప్రతీక కాదా ?
ఇవీ కారణాలుః
*కోస్తా ఆంధ్రుల భయాలు
పూర్తిగా అభివృద్ధి చెందిన తెలంగాణా ఇప్పుడు విడగొడితే కోస్తా వనరులన్నీ అటే వెళ్తాయి. దీనివల్ల కోస్తా ప్రాంతంలోని రైతులకు కష్టాలు తప్పవు, కోస్తాంధ్రకు ప్రధాన జలవనరులు కృష్ణా, గోదావరి జలాలు. సమైక్యాంధ్ర నుంచి తెలంగాణాను వేరుచేస్తే కోస్తాఆంధ్ర ఎడారిగా మారుతుంది. తెలంగాణా విడిపోతే ఆ ప్రాంత ప్రజలు కోస్తాంధ్రకు రావాల్సిన నీటిని అడ్డుకుంటారు, ఫలితంగా వ్యవసాయం, దాని అనుబంధ పరిశ్రమలు మూతపడి నిరుద్యోగం పెరుగుతుంది. ఖమ్మం జిల్లాలో 256 గ్రామాలు సుమారు లక్ష ఎకరాలు మునిగిపోతాయనే సాకుతో పోలవరం ప్రాజెక్టును కూడా అడ్డుకుంటారు. విద్యుత్తు సరఫరాలో కూడా అంతరాయాలు ఏర్పడతాయి, తెలంగాణాలో అత్యధిక సంఖ్యలో ఉన్న సీమాంధ్ర ఉద్యోగులు తిరిగి తరలివస్తారు. కోస్తాంధ్రకు ఆదాయాలు కూడా తగ్గుతాయి.హైదరాబాదులో అధిక ధరలకు కొని కూడబెట్టుకున్న కష్టార్జిత ఆస్తులు చౌకగా అమ్ముకోవాల్సివస్తుంది.
*తెలంగాణా వాదుల వాదనలు
ఇది ఆత్మ గౌరవ సమశ్య.మమ్మల్ని మేమే పరిపాలించుకుంటాము.పెద్దమనుషుల ఒప్పందాన్ని ఏనాడూ ఆంధ్రులు అమలు చేయలేదు.ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వటంలేదు.కృష్ణా గోదావరి నదుల పరివాహక ప్రాంతం 80 శాతం మాదైతే 88 శాతం నీళ్ళు వాళ్ళవి.కరెంటు70 శాతం ఉత్పత్తి మాది. 80 శాతం పంట ఋణాలు వాళ్ళవి.మూడొంతుల ఉద్యోగాలు వాళ్ళవి.తెలంగాణా ఆంధ్రుల వలస కేంద్రంగా మారింది.ఇక్కడ సెటిల్ అయిన ఆంధ్రవాళ్ళు ఇక్కడే ఉండి పోటీ చేసి గెలవండి..పొట్టకూటికోసంవచ్చిన వాళ్ళను వెళ్ళీపొమ్మనము గానీ మా పొట్ట కొట్టేటోళ్ళనే వెళ్ళిపొమ్మంటున్నాం.శాంతియుతంగా అన్నదమ్ముల్లా విడిపోదాం.
*ఐఏఎస్ ఐపిఎస్ల భయం
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితే ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన వారందరిలో ఎక్కువ శాతం కొత్తగా ఏర్పాటు అయ్యే ఆంధ్ర రాష్ట్రా సర్వీసుల్లోకి వెళ్ళాలి.ఒక వేళ గ్రేటర్ హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించినట్లయితే కేంద్ర సర్వీ సులకు చెందిన అధికారులను మూడుగా విభజిస్తారు.హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తించినట్లయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధి లోకి వచ్చేందుకు కేంద్ర సర్వీసు అధికారులు విముఖత చూపుతున్నారు. ఎందుకంటే యూనియన్ టెరిటరీ కేడర్లోకి వచ్చినట్లయితే ఇకపై వారి బదిలీలన్నీ కేంద్ర పాలిత ప్రాంతాలకే పరిమితమవుతాయి. దీని వల్ల హైదరాబాద్ యూనియన్ టెరిటరీ(కేంద్ర పాలిత ప్రాంతం) నుంచి వేరొక చోటకు బదిలీ కావాలంటే మరొక కేంద్ర పాలిత ప్రాంతానికే బదిలీ కావా ల్సి ఉంటుంది.
*తెలుగు సినీ పరిశ్రమ భయం
మద్రాసు నుండి హైదరాబాద్కు తరలివచ్చిన ఆంధ్ర ప్రాంతానికి చెందిన నిర్మాతలు రామకృష్ణ సినీ స్టుడియో, అన్నపూర్ణ సినీ స్టుడియో, రామానాయుడు స్టుడియో, పద్మాలయా స్టుడియో, రామోజీ ఫిలింసిటీ స్టుడియోలు నిర్మించారు. కె.రాఘవేంద్ర రావు, అక్కినేని నాగార్జునకు ప్రభుత్వం స్థలం కేటాయించింది. పద్మాలయా స్టుడియో లోని కొంత భాగాన్ని ఇతరులకు విక్రయించిన వ్యవహారం పై టిఆర్ఎస్ కోర్టుకెళ్ళింది. తమ ప్రాంతంలో పేదలకు పంపిణీ చేయవలసిన భూములను ఆంధ్రా ప్రాంతానికి చెందిన సినీవర్గాలకు ఇచ్చారన్న వివాదం మొదలయింది.