Feeds:
టపాలు
వ్యాఖ్యలు

Posts Tagged ‘Talangana’


Sonia కాదు వారి అత్తమ్మ ఇందిరైనా సరే ఈ హఠాంపరిణామాన్ని ఊహించి ఉండరు. దిల్లీలో కూర్చుని, వి.హెచ్ వంటి పూజారుల పూజలు అందుకుంటూ తామే నిర్ణయం తీసుకున్నా పడుంటారని భావించిన సోనియాకు 56 మంది కాంగ్రెస్ ఎం.ఎల్.ఏ ల రాజినామా దిమ్మ తిరిగేలా చేసింది.

ఆరునెలలకో సి.ఎం ను మార్చి చేతులు కాల్చుకుని కాస్త బుద్ది తెచ్చుకున్న దిల్లీ నాయకత్వం వై.ఎస్. మరణానంతరం మళ్ళీ పాత మాట మొదలు పెట్టింది. నేను గత శాసన సభ ఎన్నికల సందర్భాంగానే నా బ్లాగులో స్పష్ఠంగా చెప్పాను. కే.సి.ఆర్ భూతం కాడని, బాటిల్లో భూతమని. టి.ఆర్.ఎస్. ఆవిర్భావం నాటినుండి ఎలక్షన్ టు ఎలక్షన్ తన ఉనికిని పోగొట్టుకుంటూ వచ్చిన తి.ఆర్.ఎస్ లో కే.సి.ఆర్ అతని కుటుంభ సభ్యులు తప్ప మరెవ్వరూ లేని స్థితి వచ్చింది

మార్కెట్ పోగొట్టుకున్న హీరో ఏ.ఆర్ రహ్మాన్ కాల్షీట్ పట్టుకున్నట్టుగా కే.సి.ఆర్ దీక్ష చేపట్టాడు. నాల్రోజులు చెయ్యించి ఉంటే ఆయనగారికి ఆయనే నిమ్మరసం తాగి ఇంటికెళ్ళి క్వార్టర్ కొట్టి పనుకొనే వాడు. వై.ఎస్. ఉన్నంత కాలం చెప్పు క్రింద తేలులా ఉన్న కే.సి.ఆర్ రోశయ్య వాలకం చూసి తోక విప్పాడు నిప్పు పెట్టాడు. కాగితంలోని పులి బొమ్మ చూసి జడుచుకున్నట్టుగా సోన్మియా చిదంబరం చేత ప్రకటన చెయ్యించారు. ఆ ప్రకటన వెలుబడకున్నా కే.సి.ఆర్ దీక్ష విరమించే వాడే.

ఆ దిశగా నింస్ హాస్పిటల్ లో టి.ఆర్.ఎస్ పార్టి పొలిట్ బ్యూరో సమావేశం కూడ ఏర్పాటైంది. అసలు కాంగ్రెస్ పార్టి చరిత్ర తెలిసిన ఎవరికైనా తెలుసు అది ఉత్త ఉసిరికాయల బస్తా. ఆ బస్తా ముడి గట్టిదైతే గాని ఏ కాయ బస్తాలో ఉండదు. కాంగ్రెస్ అదిష్ఠానం తీరే ఇంత. అవసరానికి మించి నాంచడం. లేదా తొందర పాటు నిర్ణయం తీసుకోవడం. ప్రతిభగల వారికన్నా చంచా గాళ్ళను నమ్ముకోవడం. వై.ఎస్. అయితే ఇటు ప్రతిభావంతుడైనప్పటికి విధేయత ప్రదర్శిస్తూ వచ్చాడు.

రోశయ్యలాంటి వారు బాత్ రూం పోవాలన్నా అదిష్ఠానం అనుమతి కోరే వారు. ఇక్కడ తెలంగాణా కాలుతుంటే అంతా అదిష్ఠానం చూసుకుంటుందన్నాడు. విలేకర్లు ఎం.ఎల్.ఏ ల రాజినామా గురించి అడిగితే నాకు తెలియదన్న ఘనుడు ఈయన. లౌఖ్యం ఉండొచ్చుగాని అది మరీ మితి మీరితే ఇలానే ఏడుస్తుంది

అటు ఎన్.టి.ఆర్ గాని ఇటు వై.ఎస్. గాని సమైఖ్యాంద్ర ప్రదేశే దేయంగా ఉన్నవారు. తెలంగాణొస్తే ఏమౌతుంది ? కొత్తగా మరో సి.ఎం, మరో క్యేబినెట్, మరో శచివాలయం ప్రజాదనానికి బొక్క అంతేగా
అసలు కే.సి.ఆర్ది ఒక దీక్షేనా ? సెలైన్ అంటే ఏమి ? అది ఫుద్ కాదా. రోజుకి మూడు పూట్ల సెలైన్ ఎక్కించుకుని దీక్షంటూ కథ నడిపితే సోనియా మేడం విరేచణాలయ్యి చిదంబరం చేత ప్రకటణ చెయ్యించింది. అసలు కే.సి.ఆర్ మీద 420 సెక్షన్ క్రింద కేసు పెట్టించాల్సింది. దీక్షని ప్రజలను మోసగించినందుకు. అసలు మీదియావారిని అనాలి. అదో దీక్ష దానికీ కవరేజి

ఇక రాజినామా చేసిన ఇతర పార్టి ఎం.ఎల్.ఏల వివరాలిలా ఉన్నాయి.
తె.దే.పా: 29
పి.ఆర్.పి 11
ఈ క్లీష్ఠ పరిస్థితిలో సోనియా మేడం చెయ్యవలసింది రెండే ఒకటి తెలంగాణ కావాలో వద్దో తెలంగాణా ప్రాంత ప్రజల మద్య వోటింగ్ కు ఆదేశించటం, జగన్ ను సి.ఎం చెయ్యడం. జతిగిన దుష్పరిణామాలన్ని రోశయ్య చేతగాని తనంతోనే జరిగాయి. కనీశం భవిష్యత్త్లో జరుగనున్న నష్ఠాలను వారించటానికన్నా జగన్ ను సి.ఎం చేసి తీరాల్సిందే

గమనిక:
మా చిత్తూరు పురపాలక చేర్మన్ సహా అందరు కౌన్సిలర్లు మూకుమ్మడిగా రాజినామా చేసేరు

Read Full Post »