Feeds:
టపాలు
వ్యాఖ్యలు

Posts Tagged ‘Dr.YSR’


డా. వై.ఎస్ మరణానంతరం ఆ బాధ తట్టుకోలేక మరణించిన కుటుంభాలను ఓదార్చటానికంటూ జగన్ చే పట్టిన  ఓదార్పు యాత్రలో జీర్ణించుకోలేని అంశాలు కొన్ని ఉన్నాయి. మొదటిది ఇంత ఆలశ్యంగా ప్రారంభించటం. వై.ఎస్. మరణించి వారం పది రోజుల్లో తమ కుటుంభ పెద్దను / ముఖ్యులను పోగొట్టుకున్న కుటుంభాలను ఓదార్చటానికి  ఆరు నెలలనంతరం వెళ్ళటమే.

ఏ పనికన్నా ఒక కాల పరిమితంటూ ఉంది. కాని జగన్ ఈ విషయంలో మరో ఆలశ్యం చేసాడు.

సరే అయినదేమో అయినది. కనీశం కార్యక్రమ రూపకల్పణలోనన్నా కాసింత జాగ్రత్తలు తీసుకుని ఉండవలసింది.ఎన్నికల ప్రచారంలా ఆ డప్పులు, కాన్వాయి, అసహ్యంగా ఉన్నాయి

పోని ఇతనేమన్నా పది ఇరవై లక్షలు ఆ కుటుంభానికి సాయం చేస్తున్నాడా అంటే అదీ లేదు. జగన్ సాయం ఒక్క లక్షే

ఇది కాల్ రూపాయి కోతి ముక్కాలు రూపాయి బెల్లం తిన్నట్టుంది.  ఇతను చేయనున్న సాయమేమో లక్ష రూపాయలే. కాని కార్యక్రమ నిర్వహణకు ఖర్చు వంద రెట్లు

జిల్లాకో కార్యక్రమం అదీ విమానాశ్రయం దగ్గర్లోనే  ఇండోర్ లో ఏర్పాటు చేసుకుని హృదయానికి హత్తుకునే విదంగా నిర్వహించి ఉండ వచ్చు. చేసే సాయం ఏదో నిజంగానే సతరు కుటుంభాన్ని నిల బెట్టే విదంగా ఉండి ఉంటే మంచిది.

ఇవన్ని ఒక ఎత్తైతే ఈ కార్యక్రమం గురించి సాక్షి మరియు ఇతర (కొన్ని) చేనల్స్ లో చేసే ప్రచారాల హడావుడు చాలా విడ్డూరంగా ఉన్నాయి.

జగన్ మనస్తత్వం ఎవరికీ అర్థం కానిదై ఉంది. వై.ఎస్. చని పోయినప్పుడే సంతకాల సేఖరన  చేపట్టిన జగన్ మరెందుకో మెత్త బడి పోయారు. అలా చెయ్యడం సాంఘికంగా తప్పేమో గాని రాజకీయంగా తెలివైన చర్యే.  ఆ తరువాత ఇడుపులపాయలో పెద్ద భహిరంగ ఏర్పాటు చేసారు. సోనియా పేరన్నా ఎత్తకనే ప్రసంగం పూర్తైంది. పైగా కెమరాలకు ప్రధానంగా  త్రివర్ణ పతాకం మద్యలో వై.ఎస్. బొమ్మ ఉన్న జెండా కవర్ అయ్యేలా చేసారు. ఇదీ తెలివైన ఎత్తే. పార్లెమెంటులో గోల్డెన్ తెలంగాణా నినాదం కూడ క్శమార్హమే .

కాని రిలయన్స్ ఉదంతం, క్యేన్సర్ వ్యేక్సిన్, ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు  విద్యుత్తును భయిట  విక్రయించుకునే  వెసలు బాటు కల్పించటాన్నివ్యతిరేకించి నాలుక కరచుకోవడం జగన్ పై నా బోటివారికి ఉన్న విశ్వాసాన్ని  చాలా తీవ్రంగా దెబ్బ తీసాయి.

ఎలాగూ రోశయ్యతో కాని, రాహుల్ తో గాని, సోనియాతో గాని, పార్టిలోని సీనియర్ల తో గాని పొత్తు పొసగ లేదు. రానున్నవి స్థానిక ఎన్నికలే. వీటిలో పార్టికన్నా అభ్యర్దికే ప్రాధన్యత ఉంటుంది. జగన్ కాంగ్రెస్ వై.ఎస్. పార్టి స్థాపించడానికి ఇదే అనువైన కాలం.  ఇలా తన ఉనికిని చాటుకుంటే కొత్త పార్టి తదుపరి ఎన్నికల్లోపు భలపడవచ్చు, సోనియా మనస్సు మార వచ్చు.

ఈ ఓదార్పు యాత్రలు, ఈ హడావుడీలు ఎన్ని రోజులు గుర్తుంటాయి. జగన్ ఆలోచించాలి.

Read Full Post »



అవును. అటు సోనియ,ఇటు రాష్ఠ్ర నాయకత్వం జగన్ కున్న ప్రజా బలాన్ని గుర్తించ లేదు. పైగా జగన్ గారిని ఎలాగన్నా తొక్కి పెట్టాలనే చూస్తున్నారు. ఇది ఈ ఏడు నెలల్లో భాగా రుడీ అయిపోయింది .ఈ పరిస్థితిలో ఓదార్పు యాత్ర ,రాజ్కీయం మాట్లాడనువంటి ముసుగులో గుద్దులాటలు జగన్ కు అనవసరం.

తెగించి కొత్త పార్టి ప్రకటించాలి. రానున్నవి స్థానిక ఎన్నికలే. వీటిలో పార్టికన్నా అభ్యర్దులను చూసే జనం ఓటేస్తారు. ఈ యాత్రలు పాడు పరదేశాలకు ఖర్చు పెట్టుకోవడానికంటే సూటిగా కొత్త పార్టి పతాకం క్రింద స్థానిక ఎన్నికల్లో విజయ ఢంకా మృఓగిస్తే అటు దిల్లి, ఇటు రాష్ఠ్రంలోని గల్లీలు కదులుతాయి.

జగన్ ఆలోచించండి !

Read Full Post »


అవును. నేనిదివరకే చెప్పినట్టు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టిని గెలిపించింది సాక్షి పత్రిక & సాక్షి టివియే.అంటే జగన్ బాబే. అటువంటిది జగన్ ఎప్పటికైనా నేనే సి.ఎం అనడం కొంత చేతగాని మాటగా కనిపిస్తూంది. అవును . నేను వై.ఎస్.ఆర్ అభిమానినే. అయితే తొలూత నుండి జగన్ వ్యవహార శైలి నాకు మింగుడు పడటం లేదు. ఒక విదంగా జగన్ రజిని కాంత్ ను తలపిస్తున్నాడు. ఆయనా అంతే తన సినిమా రిలీజ్ అయ్యే సమయానికి ఏదో ఒక టి చెప్పి సంచలనం సౄష్ఠించటం ఆ పై మౌనం వహించటం చేస్తూ ఉంటాడు.

వై.ఎస్. మరణానంతరం జగన్ సి.ఎం. కావాలని రాష్ఠ్రం ముక్త కంఠంతో అంటే , జగన్ సేన, యూత్ కాంగ్రెస్ వారు పెద్ద యెత్తున ఆందోళనలు చేపట్టారు.దీనిని పార్టిలోని కొన్ని ముసలి నక్కలు ఆదిష్ఠానానికి వేరే విదంగా కమ్యూనికేట్ చేసాయి. పోనీ.. వారు చెయ్యాల్సిందే చేసారు. ఆదిష్ఠానానికి జగన్ బాబుకు మద్య అఘాదం ఏర్పడింది. వై.ఎస్.ఆర్ సంతాప సభలో సోనియా పేరెత్తకుండానే జగన్ ప్రసంగించారు. రాజకీయ చదరంగంలో ఇది గొప్ప చెక్. (పైగా తొలూత నుండి టి.వి.కెమరాలకు ఓ జెండా అగుపడుతూనే ఉండే ..అది త్రివర్ణ పతాకము . మద్యలో వై.ఎస్.ఆర్ రూపం ఉండే. వెరి గుడ్ అనుకున్నాను.

కాని డిల్లీనుండి పిలుపందగానే నా భవిష్యత్ సోనియా చేతుల్లో పెట్టానని జగన్ వెను తగారు. ఇదీ ఓకే. వెంబటే ఒక జలక్ ఇచ్చారు. వై.ఎస్. పథకాల అమలుకు ప్రభుత్వం పై వత్తిడి తెస్తా అన్నారు. వెరి వెరి గుడ్.

సోనియాతో తొలి విడత చర్చలంతరం నేను స్వతంత్రించి ఏమి చెప్పలేను . నాన్న గారి సహచరులు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్నారు .వారితో చర్చించి వారిని ఒప్పించి వస్తానని ఫిట్టింగ్ పెట్టుంటే అది రాజకీయం. పోని ఎలానో వ్ధేయత ప్రకతించారు. అదీ గతం గతమే.

కొండా సురేఖ రాజినామా చేసారు. అనంతరం సోనియా వద్దకు జగన్ వెళ్ళి కలిసారు. అప్పుడైనా సురేఖను మళ్ళీ మంత్రి మండలికి తీసుకోవాలని పట్టు పట్టి ఉండాల్సింది.
నేనైతే త్యాగం చేస్తాను. కాని నమ్మిన వారిని ఆదుకోవడం నాన్నగారి సిద్దంతం అందుకు నేను కట్టుబడి ఉంటానని పట్టు పట్టి ఉండాలి.

ఆ పనీ చెయ్యలేదు. కడప టిక్కెట్ విషయంలోనైనా పట్టు పట్టి ఉండాలి. అదీ చెయ్యలేదు.

నేనైతే సెప్టంబరు 14 న ఆయనకో ఉత్తరం పంపాను (కొరియర్ ద్వారా). మీ మద్దత్తు దారులను గవర్నరు వద్దకు తీసుకెళ్ళండి. మెజారిటి సభ్యుల మద్దత్తు లభించకున్నా బాధ లేదు. మేము కాంగ్రెస్ వై.ఎస్.ఆర్ పేరిట వేరే గ్రూపుగా పని చేస్తాం. ప్రస్తుత ప్రభుత్వానికి భయిటనుండి మద్దత్తిస్తామని ప్రకటించండి . కనీశం రీమోట్ అన్నా చేతికొస్తుంది. రానున్న 18 న నిండు అమావాశ్య కావున పంచాంగం పాడూ చూసుకోవలసిన అవసరం కూడ లేదని స్పష్ఠంగా పేర్కొన్నాను.

దీని ప్రతిని ఎం.పీలందరికి మెయిల్ చేసాను. జగన్ సంభంధ వెబ్సైట్స్ కీ పంపాను. కాని ఏం లాభం?

రాజకీయంలో ఎప్పటికైనా అనే మాట చేతగాని మాట. ఎంత పెద్ద లస్ఖ్యానికన్నా తక్కువ డెడ్ లైన్ సూచించాలి. అయితే ఆ డెడ్ లైన్ని నాయకుడు నమ్మరాదు. వాస్తవం తెలిసి ఉండాలి. ( కే.సి.ఆర్ చేసిన పొరభాటు ఇదే. కార్యకర్తలను నమ్మించాల్సింది పోయి తనే నమ్మడం మొదలు పెట్టి పప్పులో కాలేసాడు

కాంగ్రెస్ పార్టి చరిత్ర చూస్తే జగన్ బాబుకు పూర్తిగా అర్థం అవుతుంది .వారి తంతే అందితే జుట్టు, అందకుంటే కాలు చందాన ఉంటుంది. ఇక్కడి మాజి సి.ఎం.కుమారుల పరిస్థితి చూసన్నా జగన్ మేల్కోవాలి.

ఇప్పటికీ మించి పోయిందేమి లేదు ఏదో ఒక డిమాండు రోశయ్యకు పెట్టాలి. డెడ్ లైన్ పెట్టాలి.
( ఉ, సురేఖ విషయ్మే అయినా మంచిదే ) లేకుంటే మేము వేరే గ్రూపుగా చీలి పోతాం. అప్పటికి సోనియానే మా నాయకురాలు. వై.ఎస్. పథకాలకు, వై.ఎస్. వర్గీయులకు హాని జరక్క చూడటమే మా ద్యేయం అని ప్రకటించ వచ్చు.

జగన్ బాబు ఒక్క సారి వేంక్కి తిరిగి చూడండి. వై.ఎస్. పార్థివ దేహం ఉండగా ఎం.ఎల్.ఏల ప్రవర్తన ఎలా ఉండే ? నెలకు ఎలా మారే ? రెండు నేలకు ఎలా మారే ? ఇప్పుడు ఎలా మారే ? ఆలోచించండి. ఇప్పటికే చాలా ఆలశ్యం చేసాం. మీరు సి.ఎం. ఇప్పుడే కాకుంటే పోయే. కాని ఎప్పుడు సె.ఎం.కావాలన్న సంగతి కనీశం మనకన్నా తెలిసి ఉండాలి.

నేను చెప్పిన పని చేస్తే ఎన్నికలు ఎప్పుడు రావాలో ? ఎవరు సి.ఎం.కావాలో నిర్ణయించే పొజిసహ్న్ మీకొస్తుంది.

డా. వై.ఎస్.ఆర్ రహే !

Read Full Post »


చేతికొచ్చిన కొడుకు
చేతి వేళ్ళల్లోని గోళ్ళను కొరుకుతుంటే
మందలించావు
అతను పరోక్షంగా నీ పొగ అలవాటు పై దాడి చేస్తే
పగ అలవాటు లేని నీ గుండెకు
పొగను సైతం దూరం చేసావు
నాడు తీపి మానమని కొడుక్కి సలహా ఇవ్వమని
కోరిన తల్లిని తాను తీపి మానేంత వరకు తిప్పించిన
రామ కౄష్ణ పరహంసుని గుర్తుకు తెచ్చావ్

పేరు పేరున పలకరించే నీ మదిలో జ్ఞాపకాలు జాం అయ్యి
ఆ పేరు భయిట పడటానికి ముందు “ఏం షార్” అని పలకరించి
వెన్ను తట్టి కౌగిలించుకునే నాన్నతనం మమ్ము పులకరింప చేస్తుంది

నాడు ఏ కొత్త పథకం అమలు కాకున్నా
ఏ కొత్త ప్రాజెక్టు ప్రారంభం కాకున్నా
ఉన్నవి సైతం ఊద్చుకు పోయినా అధికారులకు మాత్రం గుండెల్లో రైళ్ళ పరుగులు తప్పేది కాదు
నువ్వు అన్ని సంవత్సరాలు ఎన్నికల సం. వలే పథకాలు అమలు చేస్తున్నా
ప్రాజెక్తులు చేపడుతున్నా వారిని కంటి నిండా నిద్ర పోనిచ్చావ్
పరిపాలన పై నీదైన చెరగని ముద్ర వేసావు

పుట్టనున్న పిల్లల కోసం జననీ సురక్ష పెట్టావ్
గిట్టిన వారి సతీమణుల కోసం వితంతు పించన్లు
వరసులచే సైతం తిరస్కరింప బడిన వౄద్దులకు పించన్లు
కకా వికలమైన వికలాంగుల బతుకుల్లో వెలుగును నింపే పించన్లు
నువ్వు లెక్కలేని పథకాలు పెట్టి నీకు ఏడేడు జన్మలకు రుణపడేలా చేసి
ఒక పథకం ప్రకారం శోక సముద్రాన ముంచి వెళ్ళావ్

60 కి విరమిస్తానని
ఇచ్చిన మాట నిలుపుకోవటం కోసం 10 సం.ల శ్రమ 5 సం.ల్లో చేసి ఇలా వెళ్ళి పోతావా రాజన్నా!

నాకో అనుమానం. అస్తమానం సోమ పాన సేవనంతో స్వర్గ శీమ నరకమైతే
దానిని మళ్ళీ స్వర్గం చేసేందుకు నీకు పిలుపందిందేమో ?
హ..! అదెంత పని నీకు. మూన్నెల్లో పూర్తి గావించి కీర్తి గాంచి
తిరిగి వచ్చేస్తావుగా రాజన్నా !

ఏళ్ళ తరబడి ఉద్యోగ ఖాళీల భర్తి పై నిషేదం ఉంటే
నిర్వేదంతో నీరశించిన నిరుధ్యోగుల మనసుల్లో కొత్త ఆశలు రేకెత్తించినావు

పంచె కట్టుతో వ్యవాసయ రంగాన్నే కాదు. కట్టలు తెంచుకున్న అభివౄద్ది పై వాంచతో
పారిశ్రామీకరణ చే పట్టావ్
ప్రత్యేక ఆర్థిక మండళ్ళు ఏర్పాటు చేసావు
పొరుగు రాష్ఠ్రాలు తన్నుకు పో చూసిన పరిశ్ర్మలను ఇక్కడికి తెచ్చావ్
నీ లెక్క లేని పథకాలను ప్రస్తావించటంతో
ఈ కవితాంజలి న్యూస్ బుల్లిటిన్లా ఏద్చింది

రాజన్నా ! నువ్వు అప్పట్లో ఎం.పి. వి.
పొరుగు రాష్ఠ్రపు టైర్ కంపెని సేల్స్ రెప్ నిన్ను కలవాలని కడప వచ్చాడు
టీ కొట్టులో వాకబు చేసాడు
“ఎం.పి. ఇల్లెక్కడని”
టీ కొట్టువాడు అన్నాడు. అందాక ఎందుకు కాసేపాగు. ఆయనే వస్తాడన్నాడు

అప్పుడు అక్కడికి దూసుకొచ్చింది ఓపెన్ టాప్ జీపొకతి.
దానిని డ్రైవ్ చేసుకుంటూ నువ్వు

అదీ మా రాజన్నంటే .

ప్రజా స్వామ్యమంటే అది నాలుగు స్థంబాలాట
లెజిస్లేచర్, ఎగ్సిక్యూటివ్, జుడీషియరి.
నాలుగో స్థంభం మీదియా.
ప్రజాభిప్రాయాన్ని మాత్రమే తెలుప వలసిన పత్రికలు
ఏకంగా తమ కోరికలను ,ప్రజా భిప్రాయాలుగా సమాజం పై రుద్దే
ప్రయత్నం చేసినప్పుడు
ఊళ్ళో బిడ్డలను భావిలో త్రోసి లోతు చూడక మీడియా దూకుడుకు నీ బిడ్డతో వేసావు అడ్డు కట్ట
ఆంథ్ర రాష్ఠ్ర ప్రజల మన: సాక్షిగా సాక్షి భూతమై నిలిచింది సాక్షి

ఒంటరి సిమ్హం పై అథవి పందుల దాడి చందాన
ఎన్నికల పోరు సాగితే నీ చేతి కరవాలంగా తిరింగింది సాక్షి

రాజన్నా !
తెలుగు సినిమాల్లో ఒక కథానాయకుడు డజన్ల కొద్ది రౌడీలతో ఉత్తుత్తే ఫైట్ చేస్తే నెత్తికెక్కించుకునేవారు
వరి అభిమానులు
మరి నువ్వు రాజకీయ రణ రంగంలో ఒకే ఒక్కడై ధీరత్వంతో రియల్ ఫైట్ చేస్తే హీరోలు జీరోలయ్యేరు.
అపర చాణక్యుల వ్యూహాలు బెడిసి కొట్టాయి.

Read Full Post »


YSR_CK_JAGANరాజన్న !
కవిగా నేనొక కావ్యం రాద్దామని ఎప్పటినుండో కకౄత్తి పడేవాడ్ని
కాని కదిలే కావ్యంగా నువ్వున్నంత కాలం
ఆ సాహసం చెయ్యలేక పోయాను.
నీ తెల్లని పంచ కట్టులో మా చీకటి బతుకులు సైతం
తెల్లవారుతాయని తేట తెల్లం చేసిన నీ తెల్లని
నవ్వుకున్నా చల్లని కావ్యం ఎలా పుడుతుంది ?
గ్యాసు విషయాన గ్యాసు మనుషులంతా
గ్యాసు కొడుతుంటే
నువ్వు కళ్ళు చిట్టించగా వచ్చి పడ్డ మెరుపుకన్న , నీ తెలుగు పౌరుషంకన్నా
వాడి వేడైన కావ్యం ఎలా పుడ్తుంది ?

రాజన్నా !
నువ్వు అర్ద దశాబ్దమే పరిపాలించావని అర్దాంతంగా పోఆవని
కొందరు భ్రమ పడుతున్నారు
నువ్వు ఒక శతాబ్ద కాల అభివౄద్దిని
సంక్షేమాన్ని అందించి అంబరానికి ఎగిసి పోయావు.
అక్కడి దేవతల అమరుల స్థాయికి ఎదిగి పోయావు

నేడు బాహుటంగా బయిట పడింది
ప్రజాభిప్రాయాన్ని దిక్కరించి
తిక్క తిక్కగా కలుపు మొక్కలకు నీరు పోసే ఆదిష్ఠానం యొక్క తత్వం
నువెలా భరించావయ్యా ఈ తరహా యాతన
ఒక్కోసారి అక్కడి శిలువ దిగి గాని రాజదానికి చేరేవాడివి కాదేమో
ఆదిష్ఠానానికి దోచి పెట్టావని (పోని లే దాచుకున్నావన్లే) భూచి చూపిన వారి గుమ్మం ముందు చెయ్యి చాచిన వీరా మా రక్షకులు

అందుకే చెప్పేవాడివేమో ? మీరడగ కూడదు
నేను చెప్ప కూడదని

అడగ కూడనివి , చెప్ప కూడనివి సైతం దిగ మ్రింగి మా పళ్ళాలను అన్నంతో నింపవు ..విషం తాను మ్రింగి అమౄతం పంచిన రుదౄడిలా
అందుకే నీ ముక్తి స్థలి రుద్ర కొండ అయ్యిందేమో.
హే రాజన్నా !
మనిషిగా పుట్టిన నువ్వు
మహాత్మునిగా ఎలా ఎదిగావయ్య ?
నువ్వు నీ ఆత్మ కథ రచించి ఉంటే అది మరో సత్య శోధన అయ్యేదేమో?
కేవల భూ తర్పణాలకే పరిమితమైన కసాయి గుండెలకేం తెలుసు
ప్రజల గుండెలో ఇంత చోటు ఎంత విలువైందో ?

ప్రేమలో పడ్డాకే అత్త కూతురి కట్టు, బొట్టు తెలిసొచ్చినట్టుగా
2003 పాద యాత్రలోని నీ అడుగులు ప్రజల గుండెకేసే అన్న సత్యం
పసిగట్టాక గాని నీ గతం మాకు అవగతం కాక పోయే

నాయకుడు పుడతాడని కొందరు
కాదు కాదు తనే శిలై, తనే శిల్పి అయ్యి తీర్చి దిద్దుకుంటాడని మరి కొందరు
అంటుంటే తలపట్టుకుంటిని
ఆ ప్రశ్నకు జవాబు ఏ చరిత్రలోను దొరక్క
నీ జీవిత పుస్తకం తెరిచా సమాదానం చూసి మురిసా…
అన్నట్టు జీవిత పుస్తకం ఏంది సిల్లీగా .. అదో చరిత్ర..

నాయకుడు పుడతాడు రేగు చుక్కలా ?
ప్రజల జీవితాలను కారు చీకటి కమ్ముకున్న వేళ
వారి కళ్ళు తమ ఇల వేల్పు కొరకు ఆకాశానికేసి
చూస్తే అప్పుడు కనిపిస్తుంది ఆ రేగు చుక్క !
ఈ ముక్క నాకు తెలిపిన నీ జీవితం ధన్యం
ఆ చుక్క ఎప్పుడో పుట్టింది
ప్రజ కంట మరెప్పుడో పడింది

హే జన హౄదయ నేత !
మా నమ్మకాలను వొమ్ము చేసి
ప్రపంచ బ్యాంకుకు అమ్మ చూస్తే
ఆ అంబ అమ్ముల పొదిలోని ఆగ్నేయాస్త్రంలా అడుగు ముందుకేసావు
కరుణ అడుగంటిన అవకాశ వాదులను చెడుగుడు ఆదించావ్

శల్య సారథ్యాలు, స్వప్స్ఖ దాడులు, పద్మవ్యూహంలో అభిమణ్యువును తలపించావు
అందరు డాక్టర్లు తమ చేతి స్టెత్తు తో రోగి గుండె చప్పుడు వింటారు
కాని నువ్వు రాష్ఠ్ర గుండె చప్పుడు విన్నావు

నాటి హైటెక్ ఇంద్రజాలం పై వాస్తవికతపు మంత్ర జలం చల్లావు
కోడి పిల్ల గుంట నక్కై కనిపించింది.
ఆమ్మో నాటి రోజులు తలుస్తే గుండె లయం తప్పుతుంది
ఆ చీకటి రోజుల్లో రాష్ఠ్ర వ్యవసాయరంగం అహల్యలా బండై పోయుంటే శ్రీరామునివలే నీ పాదం మోపి , ప్రాణం పోసావు.
గుల్బర్గాలో నువ్వు మెడిసిన్ చదువుతున్న రోజుల్లో
నీ అభిమాన కథానాయకుడు ఎన్.టి.ఆర్ .
ఎవరినన్నా ప్రభావితం చెయ్యగల నటుడని నువ్వే కొనియాడిన
అతను రాయల శీమ ప్రాజెక్టులను విశ్మరిస్తే అసెంబ్లీ ముందే నిల బెట్టి నిల దీసావు
ఇది మొన్నటి సత్యం

ఎన్.టి.ఆర్ పేదవానికి కూడు అందించటానికి మొదలు పెట్టిన ప్రయత్నాన్ని నువ్వు పూర్తి చేసావు.
ప్రత్యర్ది పథకం అమలు చేస్తే కీర్తి ఎక్కడ వారిని వరిస్తుందోనని కకౄత్తి
పడక పిల్లి ఏ రంగుదైనా సరే అది ఎలుకలను పట్టాలంతే అంటూ మాసేదుంగ్ లా అమలు చేసావు రెండు రూపాయలకే కిలో భియ్యం

స్వంత అల్లుడు తుంగలో తొక్కిన పథకానికి పునర్జీవం పోసావు
అసలైన వారసుడ్ని నేనని చెప్పక చెప్పావ్.

నాటి రాజులు సైతం తమ కోటల్లో నిల్వ చేసే వారు బియ్యం
కాని సామాన్యులను వెంటాడింది ఆకలి దెయ్యం
దీంతో భూత వైద్యుని అవతారమూ ఎత్తావు
భూతాన్ని భూస్థాపితం చేసావ్

అభిమానాన్ని రాజకీయాన్ని
స్నేహాన్ని వ్యవహారాన్ని
వేరు చేసి అభిమానం చాటావు
స్నేహాన్ని నిల బెట్టావు
ఆ విశాల హౄదయంలోని ఆత్మకు నేల మీదనుండి పైకి ప్రయాణించడం ఇరుకని
నింగికి దగ్గరగా ఉన్న కొండను ఎంచుకున్నావేమో నీ ప్రాణార్పణానికి

నాటి పాలకులు 2 శాతమే ఉన్న నెటిజన్ల కోసం ఇల్లు పీకి పందిరేస్తే
నువ్వేమో 70 శాతం ప్రజానీకాన్ని పోషించే
వ్యవసాయ రంగం పై దౄష్ఠి సారించావు
ఆకలితో ఉన్నవానికి చేపలివ్వకు చేపలు పట్టడం నేర్పు అన్నాడో మేధావి
ఆ పూటకు చేపలిచ్చి , చేపలు పట్టడం కూడ నేర్పాలన్నావ్..
అవును రైతుల విద్యుత్ భకాయిలను రద్దు చేసి ఉచిత విద్యుత్ అందించి ఆ పై
మొదలు పెట్టావు జలయజ్ఞం

ఎడ తెగని కరవుతో, వ్ద్యుత్ భకాయిల వసూలు నిమిత్తం జప్తులు, క్రిమినల్ కేసులతో
వేదించిన పాలనలో ,రైతు గుండెలు చెదిరి పోనున్న తరుణంలో
ఆ అధకారంలో అరుణ కిరణంలా మండుటెండల్లో పాదయాత్ర చేస్తే
భవిష్యత్తు కబ్జల నిమిత్తమే చేసావు సర్వే అని తూలలాడిన కుర్రకార్లు తూలి పడి పుడమి తల్లిను ముద్దాడినప్పుడే అర్థమైంది
సత్యం నిలిచింది నీ వెంటని
నువ్వు క్రైస్తవుడని అన్య మత ప్రచారాన్ని ప్రోత్సహించావని గొంతు చించుకున్నవారు
గుళ్ళో పూజారికి, దేవతకు సైతం కాసుల వర్షం కురిపించిన సంగతిని మాత్రం ఏంచక్కా దాచేరు
దాస్తే దాగేదా సత్యం
ప్రేమే లక్ష్యం సేవే మార్గమని ప్రకటించుకున్నవారు అందించి ఉండాలి ఆ నినాదాన్ని నిజమైన నివాళిగా
నీ తండ్రిని పొట్టన పెట్టుకున్నవారిని సైతం క్షమించిన శాంతి పావురమా
అందుకే నీ ముక్తి స్థలి పావురాల గుట్టైందేమో?

హే ఆశ్రిత కల్ప వౄక్షమా !
ఇంకో శతాబ్ద కాలానికి నా బో(పోటి) కవులకు సైతం కల్ప వౄక్షమయావు నువ్వు
నిన్ను కీర్తించాలని దలచిన అదే క్షణం
సరస్వతి దేవి వారి నాలిక పై ఓంకారం దిద్దినంతగా
ఆసువుగా కవితలు దొరులుతాయి
అశేష ప్రజానీకం సంక్షేమమే సంకల్పంగా నువ్వు ఆశువు బాసినా
మమ్ములను ఆసు కవులు చేసావు

నువ్వూ ఓ తల్లి కడుపునే పుట్టావ్
మరి దేవుడివి ఎలా అయ్యావయ్యా ?
అమరలోకంలోని దన్వంత్రి ఆత్మ నీలో ప్రవేశించిందా ?
ఆరోగ్య శ్రీతో మమ్మాదుకున్నావు
అన్న దాతలకోశం, అన్నార్తుల కోశం నువ్వు చేపట్టిన పాద యాత్రతో ఆ అన్న పూర్ణేశ్వరి గుండె కరిగి పోయి
శివుని ఆకలి తీర్చిన గరటిని నీకిచ్చిందేమో ?

భిన్న రుచులు కలిగిన లోకులను మురిపించి వారి అహం మరిపించి ఎలా దగ్గరయ్యావయ్యా ఇన్ని కోట్ల మందికి ?
40 సం.ల వయస్సుకే తేజస్సు క్షీణించి అబధ్రతకు లోనయ్యే ఈ తరం యువతరం పుట్టుకతో వౄద్దులై బతికేస్తుంటే
60 సం.ల వయస్సుకి నువ్వు కలలు కన్న ఉషస్సు కొరకు
పరుగులు తీసి యెనలేని యశస్సును కూడ కట్టుకున్న
నిత్య యవ్వనం నీకెలా సంప్రాప్తించింది
నిస్వార్థమే నిన్ను అమౄతమై పరుగులు తీయించిందేమో ?

కాస్త పెద్ద పదవి వరించగానే పేదవాని జీవణ్మరణ సమస్య చీమకాన్న చిన్నదై కనబడే ఈ కలిలో
అంత పెద్ద పదవిలో ఉన్నా పీడిత ప్రజానీకం సమస్యలను ఎలా గుర్తుపెట్టుకో గలిగావు
సరస్వతి ఆకు తిన్నావా ? పండిన ఆకుల్లా వనికి పోతున్న వౄద్దుల ముఖాలు తలచావా ?

Read Full Post »